ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అదే విధంగా విశాలాంధ్ర దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
![ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… 2 Whatsapp Image 2024 01 12 At 11.23.03 Am](https://sakshithanews.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-12-at-11.23.03-AM-1024x683.jpeg)