SAKSHITHA NEWS

వికారాబాద్ జిల్లా

బీఎస్పీ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ పదవికి రాజీనామా చేసిన పెద్ది అంజయ్య ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సమక్షంలో 500 మందితో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ… గత 15 సంవత్సరాలుగా అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేసి బహుజనుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమించిన పెద్ది అంజయ్య బిఆర్ఎస్ పార్టీలో చేరడం శుభ పరిణామమని.. అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరుగుతుందని నమ్మి బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

ఆనందన్న సైన్యానికి అంజన్న సైన్యం తోడైంది వికారాబాద్లో బిఆర్ఎస్ విజయాన్ని ఎవరు ఆపలేరు.. 30 వేల మెజారిటీతో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్ ని గెలిపించుకుంటామని పెద్ది అంజయ్య ధీమా వ్యక్తం చేశారు.

Whatsapp Image 2023 10 28 At 5.05.30 Pm

SAKSHITHA NEWS