ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత…

Spread the love

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత…

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని ఫాక్స్ సాగర్ వద్ద శ్రీ గణేష శివ నాగేశ్వర సహిత శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, స్థానిక డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకుడు అడప శేషు, మహిళా నాయకురాలు పద్మజా రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ప్రకాష్ గుప్త, అశోక్ గుప్త, రామ్మోహన్, రాజు, శ్రీనివాస్, కిరణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page