
పటాన్చెరు పట్టణంలో 40 సంవత్సరాల నిరంతర సేవలకు ఘన సన్మానం.
గతంలో గ్రామపంచాయతీ ఎప్పుడు జిహెచ్ఎంసి కార్మికులుగా శ్రమించి రిటైర్ అయిన రాములు సత్తయ్య ను సన్మానించిన పటాన్చెరువు మాజీ సర్పంచ్, ఎం.డి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజుగారు, పాల్గొన్న పృథ్వీరాజ్ .
పటాన్చెరు పట్టణానికి గత 40 సంవత్సరాలుగా అంకితభావంతో సేవలు అందించిన ట్రాక్టర్ డ్రైవర్ సత్తయ్య మరియు నీటిపారుదల శాఖలో అప్రతిమ సేవలు అందించిన రాములు ను, వారి రిటైర్మెంట్ సందర్భంగా ఘనంగా సన్మానించారు. పటాన్చెరు పట్టణానికి దేవేందర్ రాజు చివరి సర్పంచిగా ఉన్న సమయంలో అంకితభావంతో పనిచేసి రిటైర్ అయిన సందర్భంగా MDR ఫౌండేషన్ కార్యాలయంలో వీరికి శాలువాతో సత్కారం చేసి, వారి సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా, వీరు కుటుంబంతో ఆనందంగా, ఆరోగ్యంగా రిటైర్మెంట్ జీవితం గడపాలని ఆయన అభిలషించారు. పటాన్చెరు పట్టణ అభివృద్ధిలో వీరి సేవలు మరువలేనివిగా నిలిచయాన్నారు. సత్తయ్య ట్రాక్టర్ డ్రైవర్గా గ్రామపంచాయతీ, అనంతరం జిహెచ్ఎంసి పరిధిలో నిరంతరం శ్రమించి, పట్టణ శుభ్రత, మౌలిక వసతుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. రాములు , నీటిపారుదల శాఖలో పనిచేసే సమయంలో పట్టణ ప్రజలకు నిరంతర నీరు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించారు. పట్టణంలో ఎక్కడైనా నీటి సమస్య తలెత్తినా, త్వరితగత పరిష్కారం చేసేవారన్నారు. ప్రజా సేవకు ఎనలేని కృషి చేసి, ఒక తల్లి తన పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో, అలాగే అప్పటి గ్రామపంచాయతీ మరియు జిహెచ్ఎంసి ఉద్యోగులు పట్టణాన్ని ప్రేమగా చూసుకుంటున్నారని కొనియాడారు. వీరి సేవలను గుర్తిస్తూ, సేవా ధృక్పథం కలిగిన ఉద్యోగులు ఎల్లప్పుడూ గుర్తించబడతారని పేర్కొన్నారు. రిటైర్మెంట్ అనంతర జీవితం ప్రశాంతంగా సాగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app