SAKSHITHA NEWS

సాక్షిత : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రగతి నగర్ లో చేపట్టిన ‘ఫ్రీడం రన్‘ను *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * ముఖ్య అతిథిగా, డీసీపీ శిల్ప వల్లి, ట్రాఫిక్ ఏసిపి హనుమంతరావు ,NMC కమిషనర్ వంశీ కృష్ణ తో కలిసి ప్రారంభించారు. భాగంగా ప్రగతి నగర్ అమరవీరుల స్థూపం నుండి ఇంకాయిస్ మీదుగా తిరిగి కోతి బొమ్మల సెంటర్ వరకు నిర్వహించిన 2K రన్ లో మేయర్ ,ప్రజా ప్రతినిధులు,అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ 2k రన్ లో ముందుగా చేరుకున్న వారికి మెమెంటో లను అతిధుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,తెరాస సీనియర్ నాయకులు, NMC, ఆయా డివిజన్ తెరాస అద్యక్షులు, మరియు అనుబంధ కమిటీల సభ్యులు, విజ్ఞాన్ జ్యోతి కళాశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు,NMC అధికారులు, సిబ్బంది,బాచుపల్లి సిఐ నరసింహ రెడ్డి, పోలీస్ సిబ్బంది, ఆయా డివిజన్ పరిధిలోని స్థానిక వాసులు,యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


SAKSHITHA NEWS