కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ లో పాదయాత్ర మాధవరం కృష్ణారావు

Spread the love

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ లో పాదయాత్ర ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , గాయత్రి నగర్, జ్యోతి నగర్, వెంకట సాయి గ్రీన్ సిటీలలో అన్ని విభాగాల అధికారులతో కలిసి ఐదవ రోజు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాయత్రి నగర్ లో 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించుకున్న సీనియర్ సిటిజన్ బిల్డింగ్ ప్రారంభించుకోవడం జరిగిందని.

అలాగే కార్పొరేటర్ మాట్లాడుతూ గాయత్రి నగర్ లో సున్నం చెరువు సుమారుగా 1 కోటి 30 లక్షల వ్యయంతో సున్నం చెరువు పార్కు అభివృద్ధి చేసుకున్నాం, గణేష్ మండపం పార్క్ సుమారుగా 80 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసుకున్నాం, సిసి రోడ్లు డ్రైనేజీలు మంచినీటి సరఫరా ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నామని, రాబోవు రోజుల్లో వాటర్ ట్యాంక్ పార్క్ కూడా అభివృద్ధి చేస్తాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, నాగుల సత్యం, సంపత్ రెడ్డి, సంజీవరెడ్డి, ధన్ రాజ్, వేనుగోపాల్, జ్ఞానేశ్వర్, కాశీనాథ్ చారి, వెంకటేశ్వర్లు, కమ్మరి శ్రీనివాస్, దేవరింటి మస్తాన్ రెడ్డి, సంజీవ, ముత్యాల దుర్గ, సయ్యద్ నజమ, అన్ని బస్తీల అధ్యక్షులు, అనుబంధ కమిటీ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page