SAKSHITHA NEWS

తుర్లపాడు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

సామాన్యుడి ముఖంలో చిరునవ్వులు చూసేందుకే జగనన్న సంక్షేమ పథకాలు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

87 శాతం గృహాలకు మంచి చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

చందర్లపాడు మండలంలోని తుర్లపాడు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అడిగి తెలుసుకున్నారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సామాన్యుడి ముఖంలో చిరునవ్వులు చూడటమే ధ్యేయంగా పనిచేస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నవరత్నాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 87% గృహాలకు సంక్షేమ పథకాల ద్వారా మంచి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా అవినీతికి ఆస్కారం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలకు సాధ్యం కాని రీతిలో సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యమంత్రి జగనన్న నాలుగున్నరేళ్లలో రూ.2 లక్షల కోట్లను నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలలో జమ చేశారని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించడంతో పాటు గ్రామాలను సైతం పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు మద్దతు పలికి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కోరారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ,తదితరులు పాల్గొన్నారు ..


SAKSHITHA NEWS