మా నమ్మకం నువ్వే జగనన్న

Spread the love

మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమంలో భాగంగా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం నల్లమోతు వారి పాలెం గ్రామ సచివాలయం లో ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన సభా కార్యక్రమంలో వాలంటీర్లకు, గృహ సారదులకు మరియు సచివాలయం కన్వీనర్లు కు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం గ్రామంలో మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన మండల సచివాలయం ల కన్వీనర్ సమ్మెట వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ యారం వనజా ఇసాక్, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి మరియు ఎంపీటీసీ సభ్యులు మరియు బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని మండల సచివాలయం ల కన్వీనర్ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన సూచనలు, సలహాలను పాటిస్తూ గ్రామంలోని ప్రజలందరికీ వివరిస్తూ ఇంటింటికి తిరిగి స్తిక్కీర్లు అంటించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల వలన గ్రామంలోని ప్రతి ఇంటికి మేలు జరిగింది కనుక పజలు కూడా మీ ఇళ్లకు వచ్చిన నాయకులకు, వాలంటీర్లకు, గృహ సారధులకు సహకరించి రాబోవు కాలంలో జగన్ మోహన్ రెడ్డి గారినీ ఆశీర్వదించాలని కోరారు. అనంతరం గ్రామంలోని రాధాకృష్ణ నగర్(యాదవ పాలెం) లో ఇంటింటికి తిరిగి పథకాలు వివరిస్తూ స్తిక్కర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నల్లమోతు వారి పాలెం గ్రామ వైసీపీ ఇంఛార్జి కుంటా రత్న బాబు, వైసీపీ నాయకులు సూరగాని దుర్గా ప్రసాద్, తాండ్ర శ్రీనివాసరావు, గుర్రాల అప్పారావు, తాండ్ర శేషగిరి, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page