Spread the love

చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన వికర్ సెక్షన్ కాలనీ లో HMWS & SB వారి ఆధ్వర్యంలో రూ.25 లక్షల రూపాయల అంచనావ్యయంతో చెపట్టబోయే మంజీర మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం లో మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన మంచి నీరు అందించడమే ప్రభుత్వ ద్యేయం అని, ఎన్నో ఏండ్ల మంచి సమస్య నేటి సమస్య తిరినది అని,మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులు ప్రారంభించుకోవడం ద్వారా కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గాంధీ కి, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేయడం జరిగినది ,వాటర్ వర్క్స్ బోర్డ్ నిధుల ద్వార మంజూరు అయిన నిధులతో చేపడుతున్న మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని ,ఎన్నో సంవత్సరాల నుండి నెలకొన్న సమస్య నేటి తో తీరునని కాలనీ వాసుల కోరిక మేరకు పాత మంచి నీటి పైప్ లైన్ స్థానంలో కొత్త పైప్ లైన్ వేయటం జరిగినదిఅని,ఎన్నో ఏండ్ల కలుషిత నీటి సమస్యనుండి నేటి తో విముక్తి లభించింది అని ఇకనుండి సురక్షిత మంచినీరు ఇవ్వడం జరుగుతుందని కాలనీ వాసుల సమస్య నేటి నుడి తీరనుందని ఎమ్మెల్యే చెప్పటం జరిగినది.అదేవిధంగా అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెచ్చిన కార్యక్రమం అని, నెలకు 20,000 ల లీటర్ల ఉచిత మంచి నీటి పథకం ద్వారా అర్హులైన వినియోగదారులకు చేరువయ్యేలా చేసి లబ్ది పొందేలా చూడలని, ప్రతి ఇంటింటికి తీసుకువెళ్లాలని , ప్రతి ఒక్కరికి విస్తృతంగా అవగాహన కలిపించాలని, పేదవాడలలో నివసించే ప్రతి ఒక్క వినియోగదారునికి ఉచిత నీటి సరఫరా పథకం లాభాలను అందించాలని, అదేవిదంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటి నల్ల కనెక్షన్ ద్వారా నీటి సరఫరా చేపట్టడం జరుగుతుందని మరియు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచి నీటి ని ఇవ్వడం జరుగుతుందని ,మంచి నీటి సమస్య తలెత్తకుండా పవర్ బోర్లు ద్వారా కూడా సరఫరా చేస్తున్నామని . నియోజకవర్గం లో 18 రిజర్వాయర్ లు నిర్మాణం చేసుకున్నామని .ప్రజల దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ,మరియు నియోజకవర్గం లో పూర్తి స్థాయిలో మంచినీటిని అందిస్తామని చెప్పడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు DGM నాగప్రియ ,మేనేజర్ సునీత, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు జనార్దన్ రెడ్డి,కర్ణాకర్ గౌడ్, గుడ్ల ధనలక్ష్మి, ఓ.వెంకటేష్ ,మిరియాల ప్రీతం, రాజశేఖర్ రెడ్డి, హరీష్, కార్తిక్ గౌడ్,నరేందర్ బల్లా, సందీప్ రెడ్డి, యశ్వంత్, అమిత్, కాలనీ వాసులు సికిందర్, అమీనుద్దీన్, శ్రీనివాస్, మల్లేష్, రమేష్,ఉపేందర్, అనిల్,హుస్సేన్,నిఖిల్, ప్రసాద్, పోచయ్య, నరేందర్,శ్రీశైలం, రవి డివిజన్ నాయకులు,కార్యకర్తలు,వార్డు మెంబర్లు,ఏరియా,కమిటి మెంబర్లు,బూత్ కమిటి మెంబర్లు,కాలనీ వాసులు,కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page