ఎన్టీఆర్‌ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి…

Spread the love

బహదూర్ పల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహదూర్ పల్లి ఎక్స్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ట కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు శత జయంతిని పురస్కరించుకుని నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన జీవితం సాగిందన్నారు. తెలుగు సినిమాలలో ఆయన వేసిన పాత్రల ప్రభావం ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసిందన్నారు. రాజకీయ చైతన్యం, రాజకీయంలో నాయకులు ఎలా నడుచుకోవాలని చూపించిన మహనీయుడు ఎన్టీఆర్ ని పేర్కొన్నారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని, దేశంలోనే మొట్ట మొదటిగా సంక్షేమ పథకాలను వారే ప్రవేశ పెట్టారని అన్నారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు 2 రూపాయలకే బియ్యాన్ని అందించిన‌ గొప్ప ప్రజా సంక్షేమ నాయకుడు ఎన్టీఆర్ గారని అన్నారు. నటుడిగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలకు వారు అనేక సేవలు అందించారన్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ నాయకత్వంలో 18 సంవత్సరాలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఏకైక వ్యక్తి తనేనని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పుత్ర సమానుడని, అసెంబ్లీలో చక్కటి భాషతో తన వాణిని గట్టిగా వినిపిస్తాడని అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడేటప్పుడు బెల్ కొట్టకుండా మాట్లాడే ఎకైక ఎమ్మెల్యే వివేకానంద్ గారేనని స్పీకర్ పోచారం కొనియాడారు. బహదూర్ పల్లి చౌరస్తాలో చక్కటి స్థలాన్ని ఇచ్చి విగ్రహాన్ని ప్రతిష్టించిన కృష్ణారావు , ఆర్గనైజేషన్ వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, కౌన్సిలర్ భరత్, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ట కమిటీ అధ్యక్షుడు బొడ్డు రవి శంకర్, మాజీ కౌన్సిలర్ రంగారావు, వీరబాబు, రామకృష్ణ, దిలీప్, అజయ్, నరేందర్, నర్సింహా రావు, బాబి మరియు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page