సినీనటి జయప్రదకు నాన్ బెల్ వారెంట్ జారీ

Spread the love

ఉత్తరప్రదేశ్ :
మాజీ ఎంపీ, వెటరన్ సినీ నటి జయప్రదకు మ‌రో షాక్ త‌గిలింది. ఈఎస్​ఐకి సంబంధించిన కేసులో ఇప్పటికే ఆమెకు జైలు శిక్ష పడ‌గా లేటెస్ట్ గా మరో కేసులో నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ అయ్యింది.

2019 లోక్​సభ ఎన్నికల సమయంలో నియమావ ళిని ఉల్లంఘించినందు కుగానూ ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో భాగంగా ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచా లంటూ యూపీ రామ్ పూర్ జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

2019 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ తరపున రాంపూర్ నుంచి లోక్ సభ అభ్యర్థిగా జయప్రద పోటీ చేశారు. ఎలక్షన్ కోడ్ ను ఉల్లం ఘించారంటూ జయప్రదపై కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు నమోదయ్యాయి.

ఈ కేసుల విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతోంది. కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించ లేదు. దీంతో ఆమెకు నాన్​ బెయిలబుల్​ వారెంట్​ జారీ అయింది.

ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా, అరెస్టు చేయలేదన్న ప్రభుత్వ న్యాయవాది వాదనతో కోర్టు పోలీసులపై సీరియస్ అయింది.

వెంటనే ఆమెను అరెస్టు చేసి కోర్టులో తీసుకురావా లంటూ రామ్ పూర్ ఎస్పీని ఆదేశించింది. విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది…

Related Posts

You cannot copy content of this page