SAKSHITHA NEWS

నారాయణఖేడ్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

అబద్దాలు చెప్పి మోసం చేయడంలో కేసీఆర్ తో ప్రపంచంలోనే ఎవరూ పోటీ పడలేరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. బుధవారం నారాయణఖేడ్ నియోజకవర్గంలో జరిగిన విజయభేరి జనసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను ఏడాదిలో పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పిండు..కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు కడతమన్న కేసీఆర్ … మందేసి ఫామ్ హౌస్ లో పడుకున్నావా? నల్లవాగు లిఫ్ట్ పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని కేసీఆర్ మాట తప్పిండు అని వ్యాఖ్యానించారు.
ఇందిరమ్మ రాజ్యంలో నారాయణ్ ఖేడ్ ను అభివృద్ధి చేసే బాధ్యత మాదన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను గెలిపిస్తే ప్రత్యేక నిధులతో ఇక్కడి తండాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సర్పంచులకు బిల్లులు రావాలంటే నియోజకవర్గంలో భూపాల్ రెడ్డిని బండకేసి కొట్టాలన్నారు. కేసీఆర్ తాత దిగొచ్చినా.. నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ పార్లమెంటు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మీ ఉత్సాహం చూస్తోంటే నారాయణ్ ఖేడ్ గడ్డపై సంజీవ రెడ్డి 50 వేల మెజారిటీతో గెలవడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో సురేష్ షెట్కార్ ని పార్లమెంటు సభ్యుడిగా గెలుపించుకునే బాధ్యత మాది అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Whatsapp Image 2023 11 22 At 6.20.50 Pm

SAKSHITHA NEWS