SAKSHITHA NEWS

నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ —

*
సాక్షిత : విజయవాడ గురునానక్ కాలనీ లో మండీ క్రూడ్స్ వారి అరబిక్ రెస్టారెంట్ నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని వ్యాపార ప్రారంభ సూచిక గా రిబ్బన్ కత్తిరించి జ్యోతి ప్రజ్వలన గావించి వారి వ్యాపారం విజయవంతం కావాలని యాజమాన్యం వారికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ .*

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ని తొలుత మండీ క్రూడ్స్ యాజమాన్యం వారు దుశ్శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాలు అందించి వారిని సాధరంగా ఆహ్వానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖ నాయకులు, వ్యాపారస్తులు, అభిమానులు మరియు ఆ సంస్థ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS