దేశభద్రత బీజేపీతోనే సాధ్యం

Spread the love

కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే

2028లో తెలంగాణ అసెంబ్లీపై బిజెపి జెండా ఎగరడం ఖాయం

తెలంగాణలో మోడీ వేవ్ వచ్చింది

3 లక్షల మెజారిటీతో చేవెళ్ల పార్లమెంట్ గెలుస్తున్నాం: కొండ విశ్వేశ్వర్ రెడ్డి
……

సాక్షిత శంకర్‌పల్లి : గత తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో దేశంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు దేశ రక్షణ అభివౄఎద్ధి చూసి మరోసారి నరేంద్ర మోడీని భారత ప్రధానిగా చేయడం తద్యమని చేవెళ్ల నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొండ విశ్వేశ్వర్ రెడ్డి చేపట్టిన ప్రజా ఆశీర్వాద యాత్ర శంకర్‌పల్లి మండల పరిధిలోకి ప్రవేశించింది. మండలంలోని లక్ష్మారెడ్డిగూడ, గాజులగూడ, మహాలింగాపురం, ఆలంఖాన్ గూడ, ఫతేపూర్, బుల్కాపూర్, ప్రొద్దుటూరు, టంగుటూరు, మోకిల గ్రామాలలో యాత్ర కొనసాగింది.

ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే గుర్తింపు పొందిన దేశంగా అవతరించిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమాయక ప్రజలను మభ్యపెట్టి 6 గ్యారంటీల పేరుతో అబద్ధాలు చెప్పి అధికారం చేపట్టి 100 రోజులైనా ఏ ఒక గ్యారెంటీని నెరవేర్చలేని అసమర్థత పాలన చేస్తుందన్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అన్నారు. 2028లో తెలంగాణ అసెంబ్లీ పై బిజెపి జెండా ఎగరడం ఖాయమన్నారు. తెలంగాణలో మోడీ వచ్చిందన్నారు. మూడు లక్షల మెజార్టీతో చేవెళ్ల పార్లమెంట్ గెలుస్తున్నామని కొండ విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల, మున్సిపల్ బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page