కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నారీ శక్తివందన్ కార్యక్రమం..

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నారీ శక్తివందన్ కార్యక్రమం..
*ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *.


సాక్షిత : బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని స్థానిక ఐడిపిఎల్ చౌరస్తా లోని జై కన్వెన్షన్ లో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నారీ శక్తి వందన్ కార్యక్రమానికి ముఖ్య అథితిగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు.

ప్రధాని నరేంద్ర మోడీ నారీశక్తి బంధన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ సోదరీమణులను ఉద్దేశించి వర్చువల్ గా ప్రసంగించారు.

ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మహిళా మోర్చా నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వర్చువల్ గా వీక్షించారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు పదేళ్ల పాలనలో మహిళల కొరకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, చట్టసభల్లో మహిళ రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ కే దక్కుతుందని అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి మెజారిటీ సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత, పున్నారెడ్డి, పరుష వేణు, దుర్యోధనరావు, కంది శ్రీరాములు, రాజేశ్వరరావు, పులి బలరాం తో పాటు జిల్లా నాయకులు, మహిళా మోర్చా అసెంబ్లీ కన్వీనర్ అలివేలు, పలువురు మహిళా నాయకులు మహిళా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page