మీడియాతో మాట్లాడిన నరేంద్ర వర్మ

Spread the love

బాపట్ల జిల్లా
బాపట్ల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం, మీ మాట – నా బాట కార్యక్రమం లో భాగంగా నేడు కర్లపాలెం మండలం లోని పేరలి గ్రామంలోని తూర్పుయాదవపాలెం లో నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ విధానాలను వివరిస్తూ మహిళలకు ప్రాధాన్యత ను ఇస్తూ వారికి చీర,నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తన గురుంచి తెలియజేసే కరపత్రాన్ని అందజేసి ఆశీర్వదించమని కోరారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నరేంద్ర వర్మ గారి కామెంట్స్..

👉 మన బాపట్ల నియోజకవర్గ ప్రజలకు అండగా మా వేగేశన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూ అందరికి చేరువ అయిన విషయం అందరికి విదితమే.

👉 నేడు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ గా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేను మీ ఆశీస్సులు కోరుతూ మీ ముందుకు వచ్చిన నన్ను మీ కుటుంబ సభ్యుడిలా భావించి ఆదరించాలని కోరుతున్నాను.

👉 ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని నన్ను ఎన్నుకొంటే,అవినీతి, లంచాలకు తావులేని వ్యవస్థ లను నిర్మించి కలిసికట్టుగా మన బాపట్ల ను అభివృద్ధి చేసుకొందాం.

👉 పెరలి గ్రామాన్ని తెలుగుదేశం అడ్డాగా చేసి భారీ మెజారిటీ వచ్చేలా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలి.

👉 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పెరలి గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి అండగా నిలుస్తున్నామని నరేంద్ర వర్మ గారు భరోసా ఇచ్చారు.

👉 ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల అధ్యక్షుడు ఏపురి భూపతి రావు పేరలి గ్రామ పార్టీ అధ్యక్షుడు దేవరపల్లి రాజా ప్రధాన కార్యదర్శి మద్దిబోయిన చిట్టిబాబు మద్దిబోయిన బులయ్య జోగి రాజేష్ ఆవుల కొనయ్య తదితరులు పాల్గొన్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page