SAKSHITHA NEWS

NAKKAPALLI నక్కపల్లి 50 పడకల ఆసుపత్రిలో షిప్ ట్రాయజన్ ఇంజక్షన్ వికటించి 17 మంది అశ్వస్థత

సాక్షిత అనకాపల్లి జిల్లా : రాత్రి డ్యూటీ డాక్టర్ జయలక్ష్మి ఈ ఇంజక్షన్ లు చేసినట్లు తెలిపారు.

గత నాలుగు రోజులుగా ఇన్ పేషేంట్ లు ఉన్నారని వారికి రెగ్యులర్ గా ట్రీట్మెంట్ జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ ట్రీట్మెంట్ లో భాగంగా ఇంజెక్షన్ ఇవ్వడం జరిగిందన్నారు.

పేషేంట్ లకు రియాక్షన్ వచ్చిన వెంటనే అంబులెన్స్ లో అస్వస్థతకు గురైన 17 మందిని అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తర్పించడం జరిగిందని తెలిపారు.

అనకాపల్లి తరలించిన పేషేంట్లు అందరూ పరిస్థితి బాగానే ఉందన్నారు.

ఈ విషయం తెలుసుకున్న నర్సీపట్నం ఇంచార్జి డ్రగ్ ఇన్స్పెక్టర్ కల్యాణి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ పేసేంట్లు అస్వస్థతకు గురి కావడానికి కారణాలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు.

పేషేంట్ల కు ఇచ్చిన ఇంజక్షన్ కు వ్యాలీడిటీ ఉందన్నారు.సిరైన్ కూడా పరిశీలించడం జరిగిందన్నారు. ఈ నివేదికను ఉన్నతాధికారుల కు తెలియజేస్తామని మెడిషన్ తయారీ లో తప్పు జరిగినట్లు తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఒక వేళ వైద్యుల నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

NAKKAPALLI

SAKSHITHA NEWS