ధీరత్వంతో కదలిరండి గౌడ బిడ్డలారా

Spread the love

సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో
బహుజనల ఐక్యత కోసం కృషిచేద్దాం
జయంతి వేడుకల్లో మాట్లాడుతున్న పాల్వంచ రామారావు తో పాటు జేఏసీ నేతలు

సాక్షి త ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న పాల్వంచ రామారావు తోపాటు జేఏసీ నాయకులంతా మాట్లాడుతూ విప్లవ వీరుడు పాపన్న స్ఫూర్తితో బహుజనుల ఐక్యత కోసం కృషి చేయాలన్నారు సుమారు 60 శాతమున్న బీసీలకు రాజకీయరంగంతో పాటు అన్నిరంగాలలో కూడా తీరని అన్యాయం జరిగి ఎంతోమంది దుర్భర జీవితాలు గడుపుతున్నా పట్టించుకునే నాధుడే లేడని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు

రాజకీయ పార్టీలకు ఊడిగంచేసే పనికిమాలిన పార్టీ సిద్ధాంతాల కోసం జెండాలు మోసే బానిసల్లాగా మారిపోయి తమకు జరిగే అన్యాయాలని కూడా పూర్తిగా మర్చిపోయారన్నారు రాజకీయ నాయకుల మెప్పుకోసం ఉత్తుత్తి హామీలు తాత్కాలిక తాయిలాల మాయలోపడి బహుజనులకు జరిగిన అన్యాయాలను మోసాలను మర్చిపోవద్దన్నారు బీసీ జేఏసీ ఉదృతంగా కొనసాగిస్తున్న బీసీల హక్కులకోసం చేసే ఉద్యమానికి గౌడ బిడ్డలందరూ మద్దతుగా నిలవాలని కోరారు వీరత్వం ధీరత్వం పౌరుషం కలిగిన సర్వాయి పాపన్న వారసులైన గౌడలు రాజకీయాలలో రాణిస్తూనే బహుజనుల ఐక్యత కోసం కృషి చేయాలన్నారు ప్రతి సంవత్సరం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మహనీయుడు పాపన్న జయంతి జరపటం ఆనవాయితీ అన్నారు

డాక్టర్ బివి రాఘవులు జిల్లాప్రధాన కార్యదర్శి టీవీ రాజు గుండ్లపల్లి శ్రీనివాస్ దుర్గాప్రసాద్ గౌడ్, శ్రీనివాస్ గరిడేపల్లి సత్యనారాయణ అల్లం సైదయ్య ఉరిమళ గౌడ్ తదితరులు పాల్గొని బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై పాపన్న స్ఫూర్తితో ఎదిరించి పోరాడుతామన్నారు

Related Posts

You cannot copy content of this page