SAKSHITHA NEWS

ఎమ్మెల్సీ కవిత ని కలిసి సంఘీభావం తెల్పిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి .
సాక్షిత : ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నాయకుల దాడి పట్ల విచారం వ్యక్తం చేస్తూ రంగారెడ్డి,వికారాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి కవిత ని పరామర్శించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి .

ప్రజాస్వామ్యం లో దాడులు సమంజసం కాదని,ఒక మహిళ నేత ఇంటిపై ఈ విధమైన చర్యకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో పాటు ప్రభుత్వ విప్ గాంధీ ,జిల్లా పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ,జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి ,ఎమ్మెల్యేలు యాదయ్య ,ప్రకాష్ గౌడ్ ,రోహిత్ రెడ్డి ,అంజయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS