చెన్నేకొత్తపల్లి, అనంతపురం రూరల్ మండలాల్లో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విస్త్రత ప్రచారం..!

Spread the love

రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి , జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ చెన్నేకొత్తపల్లి, అనంతపురం రూరల్ మండలాల్లో విస్త్రత ప్రచారం చేపట్టారు. వెల్దుర్తి, ఉప్పరపల్లి గ్రామాల్లో పర్యటించి ఫ్యాను గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. వారి వెంట గంగుల భానుమతి ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ నీరాజనాలు పలికారు. ఎక్కడ చూసినా గజమాలలతో స్వాగతం పలికారు. గ్రామాలు గ్రామాలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కి అండగా నిలిచి మద్దతు ప్రకటించాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధి పొందిందన్నారు. పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నారు. రానున్న ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా బోయ శాంతమ్మ అక్కను, రాప్తాడు ఎమ్మెల్యే గా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులుపాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page