శ్రీ రాధాకృష్ణ ఆలయ 5వ వార్షిక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే..

Spread the love

శ్రీ రాధాకృష్ణ ఆలయ 5వ వార్షిక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్ శ్రీ రాధాకృష్ణ ఆలయ 5వ వార్షిక మహోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. ఆలయ వార్షిక మహోత్సవంలో పాల్గొనడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధిలో తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, సుభాష్ నగర్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, కమలాకర్, ఆబిద్, మసూద్, ఇబ్రహీం, తిరుపతి, పీట్ల మల్లేష్, చెట్ల వెంకటేష్, చిన్నా చౌదరి, నాగేష్, హీరాలాల్ కుమవత్, పరశ్మల్ కుమవత్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page