BRS పార్టీ జెండాను ఆవిష్కరించిన MLA మెచ్చా నాగేశ్వరరావు

Spread the love

ములకలపల్లి

BRS పార్టీ జెండాను ఆవిష్కరించిన MLA మెచ్చా నాగేశ్వరరావు

MLA గా నేను గెలవకముందు MLA గా నేను గెలిచాక ఎంత అభివృద్ది జరిగింది అనేది ప్రజలందరూ గమనించాలి – MLA మెచ్చా

గ్రామంలో MLA మెచ్చా కి ఘన స్వాగతం పలికారు

MLA మెచ్చా నాగేశ్వరరావు గారు చేసిన అభివృద్ది ఏ MLA చెయ్యలేదు… ఇలాంటి MLA నీ మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిది – సర్పంచ్ కారం సుధీర్

మనకు MLAగా మెచ్చా నాగేశ్వరరావు గారు ఉండటం వల్లే మనం ఇంత అభివృద్ధిని సాధించుకున్నాం.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఎమ్మెల్యే గారు ఎం అడిగిన వెంటనే మంజూరు చేస్తున్నారు – ఎంపీపీ మట్ల నాగమణి

అశ్వారావుపేట(నియోజకవర్గం), ములకలపల్లి(మండలం), కమలాపురం(గ్రామం)లో BRS పార్టీ గ్రామ కమిటీ మరియు మండల కమిటీ నూతనంగా BRS పార్టీ దిమ్మను నిర్మించారు.ఈరోజు అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారు ఆ దిమ్మ వద్ద BRS పార్టీ జెండాను ఆవిష్కరించి స్థానిక నాయకులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.అనంతరం గ్రామస్తులందరితో సమావేశమయ్యారు. కమలాపురం గ్రామానికి సుమారు 4కోట్లతో 3 బ్రిడ్జిలు మంజూరు చేయడం పట్ల గ్రామస్థులు MLA గారికి కృతజ్ఞతలు తెలిపారు.అలాగే మాజీ వైయస్ ఎంపీపీ గొల్ల రమణ మరియు వాసవి క్లబ్ అధ్యక్షులు బిక్కుమల్ల సుధాకర్ గారు ఎమ్మెల్యే గారు సమక్షంలో BRS పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా వారిద్దరినీ ఎమ్మెల్యే గారు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు ఎమ్మెల్యే గారు.ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే చిన్నారులు సైతం MLA మెచ్చా నాగేశ్వరరావు గారిని చూడగానే ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేస్తూ వారిని గ్రామంలోకి తీసుకువెళ్ళారు(ఈ ప్రేమ ఒక్క ఎమ్మెల్యే గారికి మాత్రమే దక్కుతుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు).అనంతరం అదే గ్రామంలో ఇటీవలే బైక్ యాక్సిడెంట్స్ కి గురై గాయాలతో ఇంటి వద్ద ఉన్న గొల్ల వీరభద్రం గారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని ఎలాంటి అవసరం ఉన్న సంప్రదించాలని తెలిపారు.

ఈ సందర్భంగా MLA మెచ్చా నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కమలాపురం ప్రజలకు రుణపడి ఉంటాననీ,ఎమ్మెల్యే గా గెలిచిన వెంటనే కమలాపురం రోడ్డు మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయించాననీ MLAగా నేను గెలవక ముందు గెలిచాక ఎంత అభివృద్ది జరిగిందో అందరూ గమనించాలని,రేపటి నుంచి పోడు పట్టాలు పంపిణీ కార్యక్రమం కూడా మొదలవుతుందని… దేశంలో ఎక్కడ లేని పథకాలు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తున్నారని..మన అశ్వారావుపేట నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వ పథకం అందని ఇల్లు లేదని… కరుడుకట్టిన కాంగ్రెస్ నాయకుల ఇంటికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పథకాలు అందాయని… దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందినీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా అభివృద్ది చేసే కారు గుర్తు వైపే మనందరి చూపు ఉండాలని అన్నారు.

👉 ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఎమ్మెల్యే గా మెచ్చా నాగేశ్వరరావు గారు ఉండటం వల్లే మనం ఇంద అభివృద్ధిని సాధించుకున్నామని,ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎమ్మెల్యే గారు ఎం అడిగిన వెంటనే మంజూరు చేస్తున్నారని,ఇంతకంటే మనకేం కావాలని, ములకలపల్లి మండలంలోని అనేక మారుమూల ప్రాంతాల్లో పర్యటించి అక్కడి అభివృద్ది చేసిన ఘనత ఎమ్మెల్యే గారికే దక్కుతుందినీ మంచి చేసే BRS పార్టీ MLA మెచ్చా నాగేశ్వరరావు గారికే మనం అందరం అండగా ఉందామని అన్నారు.

👉 సర్పంచ్ కారం సుధీర్ మాట్లాడుతూ ప్రతి విషయంలో ఎమ్మెల్యే గారికి మనం అందరం అండదండగా ఉండి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందని అన్నారు.ఎందుకంటే
కమలాపురం గ్రామం 3వాగుల మద్యలో ఉండటం వరద వస్తె ఊరు దాటి వెళ్ళే పరిస్థితి లేదని,ఇన్ని ఎండ్ల నుంచి మన బాధ ఎవరు పట్టించుకోలేదని ఈరోజు సుమారు 4కోట్లతో బ్రిడ్జిలు నిర్మాణం అవుతున్నాయం టే ఒక్క MLA గారి వల్లేనని కమలాపురం ప్రజలందరూ ఎమ్మెల్యే గారికి జీవితాంతం రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ములకలపల్లి ఎంపీపీ,మండల అధ్యక్షులు,ఎంపిటిసి,మండల నాయకులు,సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page