వ్యాయామంతో ఆరోగ్యం, బిఆర్ఎస్ గెలుపుతో అభివృద్ది సిద్ధిస్తాయి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ….

Spread the love

మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి శ్రీరామ కుంట పార్క్ నందు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద , ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి వాకర్స్ తో సమావేశమై ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద , ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత పదెళ్ల కాలంలో నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశామని, అభివృద్ధి మీ కళ్ల ముందే ఉందని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని, నియోజకవర్గ అభివృద్ధి వేగంగా జరగాలంటే ఎమ్మెల్యే కేపీ. వివేకానంద కి తోడుగా ఎంపీ అభ్యర్థి అయిన రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నిజాంపేట్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్ చందు ముదిరాజ్, సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, పలువురు నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page