SAKSHITHA NEWS

తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద చేపట్టిన కృతజ్ఞత యాత్ర 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ మాణిక్య నగర్, మధుసూదన్ రెడ్డి నగర్, ద్వారకా నగర్ కాలనీలలో కుత్బుల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కే.ఎం.గౌరిష్ తో కలిసి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద పర్యటిస్తూ కాలనీవాసులకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధిని గుర్తించి మా ప్రజా ప్రతినిధిగా మీరే ఉండాలంటూ ముచ్చటగా మూడవసారి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన కుత్బుల్లాపూర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు ఈ కృతజ్ఞత యాత్ర చేపడుతున్నానని ఎంత చేసిన కుత్బుల్లాపూర్ ప్రజల రుణం తీర్చుకోలేనన్నారు.

మాణిక్య నగర్ : అధ్యక్షులు బి. మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్, వైస్ ప్రెసిడెంట్ మధు, నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఎండి. ఖలీల్ బాషా, కాలనీ సీనియర్ నాయకులు రామేశ్వర్ రెడ్డి, రఘునాథరెడ్డి, నారాయణరెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు సురేష్, బాల్రాజ్, వెంకటేష్ గుప్తా, నారాయణరెడ్డి, దామోదర్ రెడ్డి తదితరులు…

మధుసూదన్ రెడ్డి నగర్ : అధ్యక్షులు కె.నాగన్న, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి మధు, కాలనీవాసులు కుమారస్వామి, రఘుమా రెడ్డి, ఎన్వీఎస్ మోహన్ కుమార్, రమేష్ తదితరులు…

ద్వారకా నగర్: శ్రీనాథ్, సాయిలు, అంజిరెడ్డి, జంగయ్య, మల్లేష్ యాదవ్, కళ్ళెం శ్రీనివాస్, కృష్ణ, వెంకట్ రెడ్డి, నరసింహ, మల్లారెడ్డి, నార్లకంటి బాలయ్య, అక్బర్, ఆంజనేయులు తదితరులు…

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, సురేందర్ రెడ్డి, నజీర్, వెంకటేష్, అజయ్, రాజు, రమణా రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS