SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ కు చెందిన ఉద్యమకారుడు టీఆర్ఎస్ జగన్ కు జీవనోపాధి కొరకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన స్వంత నిధులతో ఆటోను అందించి అండగా నిలిచారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న జగన్ సుభాష్ నగర్ ను వీడి సొంత ఊరికి వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అతనికి భరోసానిచ్చారు. దీంతో జగన్ ఎమ్మెల్యే ని తన నివాసం వద్ద కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడం తన బాధ్యత అని అన్నారు. జగన్ కు అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, నాయకులు అడప శేషు, పద్మజ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS