సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125 గజులారమారం డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. భూస్వాముల చేతుల్లో, గడీల‌లో మగ్గిపోతున్న అణగారిన వర్గాల‌కు స్యేచ్ఛ‌ను, రాజ్యాధికారాన్ని ఇచ్చి ఒక సైన్యాన్ని నిర్మించిన మ‌హా వ్య‌క్తి స‌ర్వాయి పాప‌న్న గౌడ్ ని అటువంటి గొప్ప నాయకుడిని ఆయన 373వ జయంతి నాడు గుర్తిస్తూ నేడు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించుకోవడం ఆనందదాయకం అన్నారు. సర్వాయి పాపన్న ఆశయాల సాధనకు అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కమిటి నాయకులు, సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page