SAKSHITHA NEWS

ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కార్యక్రమాలు అమలు చేయడం తప్ప….. బీసీల కోసం చంద్రబాబు ఏం పాటుపడ్డాడు….

-ఓసి రిజర్వుడు స్థానాల్లో బీసీలకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్ ది…

-అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేసి…. ఇప్పుడు బీసీ భజన చేస్తే ఎవరూ నమ్మరు

గుడివాడ : పవన్ కళ్యాణ్ ను వెనకాల పెట్టుకొని తిరుగుతున్న చంద్రబాబు, బీసీలు వెన్నెముక్క అని ఎలా చెప్తారని కొడాలి నాని ప్రశ్నించారు.ఎన్టీఆర్ ఏర్పాటుచేసిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప,బీసీల కోసం చంద్రబాబు ఏం పాటు పడ్డాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఓసి రిజర్వుడు పదవులను కూడా ఇస్తూ,బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యత నిస్తున్నారన్నారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్, విజయవాడ మేయర్ బీసీలకు ఇవ్వడమే జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

సీఎం జగన్ నాలుగు రాజ్యసభలు బీసీలకు ఇస్తే,25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ఒక్క బీసీ కైనా రాజ్యసభ ఇచ్చార అని కొడాలి నాని ప్రశ్నించారు. విద్యా,వైద్యం పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడంతో పాటు బీసీల ఆర్థిక ఉన్నతకి సీఎం జగన్ అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని కొడాలి నాని అన్నారు. రాష్ట్రంలోని బీసీ ,ఎస్సీ ,ఎస్టీ మైనార్టీలను, వదిలేసి పవన్ కళ్యాణ్ ను వెంటేసుకుని తిరుగుతున్న చంద్రబాబుకు 2019లో పట్టిన గతే తిరిగి పడుతుందన్నారు. 2024లో చంద్రబాబు, దత్తపుత్రుడి మబ్బులన్నీ విడిపోతాయని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

Whatsapp Image 2024 01 05 At 1.42.35 Pm

SAKSHITHA NEWS