SAKSHITHA NEWS

కమ్మ కులానికి కొమ్ము కాస్తున్న ఎమ్మెల్యే గోరంట్ల

రాజమహేంద్రవరం రూరల్, సాక్షిత :

రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గ్రామాల్లో ఉన్న ప్రజల కంటే తమ సామాజిక వర్గానికి చెందిన వారికే అధిక ప్రాధాన్యత ఇస్తూ, వారికి కొమ్ముకాస్తున్నారని రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం మురమండ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. పైకి అందరికి సంక్షేమ పథకాలు అందరికీ అందాలననే మాట… మాటల్లో తప్ప చేతల్లో లేదని అయన దత్తాత్త గ్రామమైన మురమండ గ్రామప్రజలు ఆరోపిస్తున్నారు. గత రెండు దశాబ్దాల కాలం నుండి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొనసాగుతున్నారని అంతటి సీనియర్ నేత ప్రజల బాగోగులు పట్టించుకోకుండా తమ సామాజిక వర్గానికి చెందిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

ఎమ్మెల్యే అభినందన సభలో గ్రామస్తులు దూరం…

ఈ మధ్యకాలంలోనే ఎన్నికల్లో ఘన విజయం సాధించుకున్న శుభ సందర్భంలో మురమండ గ్రామంలో స్థానిక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు సైతం గ్రామస్తులను దూరం పెట్టారని పలువురు ఆవేదన చెందుతున్నారు. మురమండ గ్రామంలో కేవలం వెయ్యలోపు మాత్రమే కమ్మ కులస్తులు ఉన్నారని, వారేసిన ఓట్ల వల్లనే తాను ఎమ్మెల్యే అయ్యారని
భ్రమ పడటం, గర్వపడడం సరికాదన్నారు. రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో కమ్మ సమాజక వర్గానికి చెందినవారు అత్యంత తక్కువగా ఉన్నారనే విషయాన్ని ఆయన గుర్తు చేసుకోవాలన్నారు. అందరూ కలిసి ఓటు వేస్తేనే తనకు ఎమ్మెల్యే పదవి దక్కిందన్నారు.

త్వరలో
ప్రభుత్వ సొమ్ముకు ప్రైవేటు పెత్తనం


SAKSHITHA NEWS