కోలనూర్ లో వైభవంగా జరిగిన సుదర్శన హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి

Spread the love

పెద్దపల్లి నియోజకవర్గం

ఓదెల మండలం/

తేది:16-04-2023

కోలనూర్ లో వైభవంగా జరిగిన సుదర్శన హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి

ఓదెల మండలంలోని కోలనూర్ గ్రామంలో అతి పురాతనమైన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీ సుదర్శన హోమం నిర్వహించారు. ఆదివారం ఆలయ వేద పండితులు ప్రతాపురం రామాచార్యుల ఆధ్వర్యంలో యజ్ఞచార్యులు మాల్లోజుల ప్రవీణ్ శర్మ నేతృత్వంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం పూర్ణ హారతి తీర్థ ప్రసాదాలు అందజేశారు.కాకతీయుల కాలంలో ప్రసిద్ది గాంచిన అతి పురాతనమైన ఆలయానికి ప్రత్యేకపేరుంది.ఈ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు హాజరైనారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మహా యజ్ఞాలు ఎంతో ప్రాముఖ్యతతో కూడుకొన్నాయని గ్రామంలో అందరూ సుఖ సంతోషాలు కల్గి ఉంటారన్నారు. అనoతంరం పండితులు రామాచారి తోపాటు హోమానికి సహకరించిన వారిని ఎమ్మెల్యే గారు సన్మానించారు.హోమానికి హాజరైన ఎమ్మెల్యే దాసరి ని గ్రామస్తులు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకట్ రెడ్డి స్థానిక సర్పంచ్ సామ మణెమ్మ-శంకర్, ఉపసర్పంచ్ పాకాల సంపత్ రెడ్డి,మండల బీఆర్ఎస్ నాయకులు ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, కలకొండ చిన్న రాజిరెడ్డి,బండారు ఐలయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు ఓదెల నరేందర్,సాతురి రాజేశం,సాతురి రవి, కొల్లూరి రాజేశం, నాగయ్య, లతోపాటు పలు ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.

Related Posts

You cannot copy content of this page