వాటర్ ఫిల్టర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చిరుమర్తి

Spread the love

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో
కీశే గుండెబోయిన మల్లయ్య జ్ఞాపకార్థంగా మాజీ సర్పంచ్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ సైదులు
ఏర్పాటుచేసిన వాటర్ ఫిల్టర్ ని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజ అవసరాల కొరకు కేవలం 5రూపాయలకే 20 లీటర్ల నీటిని ఇచ్చేలా
ఫిల్టర్ వాటర్ ని ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అని ఈ అవకాశాన్ని 5వ వార్డు, 4వ వార్డ్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇలాంటి సేవ కార్యక్రమాలు చేపట్టినందుకు ఫిల్టర్ యాజమాన్యం ను మాజీ సర్పంచ్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, మల్లెబోయిన సత్తయ్య ధనమ్మ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page