అభివృద్ధికి ఆకర్షితులై గులాబీ పార్టీలోకి చేరికలు – ఎమ్మెల్యే చిరుమర్తి

Spread the love

అభివృద్ధికి ఆకర్షితులై గులాబీ పార్టీలోకి చేరికలు – ఎమ్మెల్యే చిరుమర్తి

నకిరేకల్ సాక్షిత ప్రతినిధి

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పధకాలు సమర్ధంగా అమలు చేస్తున్నందునే ఇతర పార్టీల నుంచి గులాబీ పార్టీ (బిఆర్ ఎస్)లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ మండలం గోరెంకలపల్లి గ్రామానికి చెందిన ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వార్డు మెంబెర్ కుంచం అలివేలు సైదులు బండారు ప్రవీణ్ కుమార్ కొమ్మనబోయిన శంకర్ కొమ్మనబోయిన జానయ్య జాజుల శ్రీను కాపర్తి ప్రసాద్ చెట్టుపల్లి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పల్ రెడ్డి మహేందర్ రెడ్డి సర్పంచ్ గోరెంకలపల్లి సర్పంచ్ చెట్టుపల్లి జానయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page