మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులని పరిశీలించిన
ఎమ్మెల్యే చిరుమర్తి.

Spread the love

నకిరేకల్ సాక్షిత ప్రతినిధి

నకిరేకల్ పట్టణంలో కాలంవారి కుంట చెరువు పై జరుగుతున్న మినీ ట్యాంక్ బండ్ పనులను ఉదయం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ మినీ ట్యాంక్ బండ్ కు ప్రభుత్వం 4.92 కోట్లు కేటాయించిదని తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకి సూచించారు. అనంతరం
స్థానిక ప్రజలతో కలసి (మార్నింగ్ వాక్) పాదయాత్ర చేయడం జరిగింది.అందులో భాగంగా పలు కాలనీ లలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించి. ప్రజలను ఆప్యాయంగా పలకరించి ముచ్చటించారు. నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యం అని , ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు అధికారులు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page