సిసి రోడ్లు, డ్రైన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన

Spread the love

తిరుపతి నగరంలో సప్తగిరి నగర్, తాతయ్యగుంట ప్రాంతాల్లో తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను, డ్రైన్లను మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 43వ డివిజన్లోని సప్తగిరి నగర్, ప్రసంతి నగర్, యశోధ నగర్లో 77 లక్షలతో నిర్మించిన భూగర్భ డ్రైనేజి లైన్, సిసి రోడ్లను ప్రారంభించడం జరిగిందన్నారు.

అదేవిధంగా 11వ డివిజన్ తాతయ్యగుంట నందు 48 లక్షలతో నిర్మించిన భూగర్భ డ్రైనేజి లైన్, సిసి రోడ్డును కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. తిరుపతి నగరంలో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలకు తమ కౌన్సిల్ నిర్వహిస్తుందని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. ఈ కార్యక్రమాల్లో 43వ డివిజన్ కార్పొరేటర్ రాధా మురళీ యాదవ్, 11వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రవల్లికా రెడ్డి, మునిసిపల్ ఇంజనీర్లు వెంకట్రామిరెడ్డి, చంద్రశేఖర్, డిఈలు విజయకుమార్ రెడ్డి, మహేష్, నాయకులు మురళీ యాదవ్, దొడ్డారెడ్డి మునిశేఖర్ రెడ్డి, నాగిరెడ్డి, గీతా యాదవ్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page