SAKSHITHA NEWS

హుజూర్ నగర్ సాక్షిత

అమెరికాలో టెక్సాస్ లోని డల్లాస్ ప్రీమియం షాపింగ్ లో అగంతకుని కాల్పుల్లో అన్యాయంగా అసువులు బాసిన నెరేడుచెర్ల కు చెందిన నర్సిరెడ్డి కుమార్తె ఐశ్వర్య భౌతిక దేహం హైదరాబాద్లోని సరూర్ నగర్ లోని తమ సొంత ఇంటికి చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి,హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మరియు తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ లు ఐశ్వర్య భౌతిక దేహానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించి అశ్రునయాలతో నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది. ఈ కార్యక్రమము లో నెరేడుచెర్ల నుండి నెరేడుచెర్ల పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS