పెదపులిపాక గ్రామంలో మంత్రి జోగి రమేష్ విస్తృత పర్యటన.

Spread the love

పెదపులిపాక గ్రామంలో పర్యటిస్తూ ఆ గ్రామ ప్రజలను ప్రతి ఒక్కరిని పలకరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిస్తూ, వడివడిగా ముందుకు సాగుతున్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ .*

పెద పులిపాక,
పెనమలూరు మండలం,

సాయంత్రం పెనమలూరు మండలం పెద పులిపాక గ్రామంలో మంత్రి జోగి రమేష్ విస్తృతంగా పర్యటించారు.*

ఈ పర్యటన భాగంగా మంత్రి జోగి రమేష్ అన్ని వర్గాల ప్రజలను పేరుపేరునా పలకరిస్తూ వారికి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని వెంటనే వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా గ్రామ పార్టీకి చెందినవారు అందరూ ఏకతాటిపై నిలబడి త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సిపిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు మంత్రి జోగి రమేష్ కి సాదరంగా స్వాగతం పలికి శాలువాలతో మరియు పూలదండలతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ తనయుడు మరియు యువ నాయకులు జోగి రాజీవ్ తోపాటు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page