ఎంబీసీ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ పెండ్రా వీరన్న పుట్టినరోజు

Spread the love

బాపట్ల జిల్లా బాపట్ల లోని చీలురోడ్డు సెంటర్ లో రాష్ట్ర ఎంబీసీ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ పెండ్రా వీరన్న గారి పుట్టినరోజు వేడుకలు సందర్భంగా సంచారజాతుల రాష్ట్ర కార్యదర్శి మరియు వైసీపీ దివ్యాంగుల విభాగం బాపట్ల జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య సంచారజాతుల కులాల నాయకులతో కలిసి కేక్ కటింగ్ మరియు మహిళలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా చల్లారామయ్య విలేఖరులతో మాట్లాడుతూ సిఎం జగనన్న సహకారంతో బీసీ కులాలకు చెందిన సంచారజాతులకు చెందిన పెండ్రా వీరన్న గారిని కార్పోరేషన్ ఛైర్మన్ గా చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.అలాగే రాష్ట్రంలో వున్న సంచారజాతుల కులాల అభివృద్ధి కోసం వీరన్న పెద్ద పీట వేసి రాజకీయంగా పదవులను ఉద్యోగ ఉపాధులు కల్పించే విధంగా సంచారజాతుల కుటుంబాల సమస్యలను జగనన్న దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరిస్తున్నారని తెలియజేశారు.సిఎం జగనన్న సంచారజాతుల కులాల అభివృద్ధి కి సాధ్యమని చల్లా రామయ్య తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాపట్ల సంచారజాతుల నాయకులు పసుపులేటి సాంబయ్య,కత్తుల జార్జి,దార్ల శ్రీను,పెండ్రా కృష్ణ,కుందేటి శ్రీను,కత్తుల గోపి,చల్లా చిరంజీవి,కమాధుల నాగేశ్వరరావు,పసుపులేటి ఏడుకొండలు,చల్లా గోపి,పసుపులేటి రాజా,కత్తుల కోటేశ్వరరావు,కత్తుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page