గంగమ్మ గుడి మాస్టర్ ప్లాన్ రోడ్డును పరిశీలించిన మేయర్ శిరీష, ఉపమేయర్ అభినయ్

Spread the love

గంగమ్మ గుడి మాస్టర్ ప్లాన్ రోడ్డును పరిశీలించిన మేయర్ శిరీష, ఉపమేయర్ అభినయ్
ఏప్రిల్ 30 తేదీ లోపల గంగమ్మ గుడి మాస్టర్ ప్లాన్ రోడ్డును పూర్తి చేయాలి*
మేయర్ డాక్టర్ శిరీష,ఉప మేయర్ భూమన అభినయ్


సాక్షిత : తిరుపతి తాతయ్యగుంట మాస్టర్ ప్లాన్ రోడ్డును ఏప్రిల్ 30వ తేదీకి అందుబాటులోకి తీసుకురావాలని మేయర్, ఉప మేయర్ అధికారులను, కాంట్రాక్టర్లు ఆదేశించారు.
ఉదయం మాస్టర్ రోడ్డు సంబంధించి పనులను పరిశీలించారు. అధికారులతో కలిసి మేయర్ శిరీష, ఉప మేయర్ భూమన అభినయ్ రోడ్డుకి ఇరువైపులా టేపుతో పరిశీలించారు. మే మొదటి వారంలో గంగ జాతర ఉత్సవాలు జరుగుతాయని, అందుకు ఏప్రిల్ 30వ తేదీకి పనులు పూర్తిచేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక అసిస్టెంట్ సిటీ ప్లానర్లు బాలసుబ్రమణ్యం, షణ్ముగం, వైఎస్ఆర్సిపి నాయకులు దొడ్డరెడ్డి మునిశేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, ఉదయ్ వంశీ, తులసి యాదవ్, భరణి యాదవ్, చింతా రమేష్, నగరపాలక టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు శారదంబ, సాయి లీల, ప్లానింగ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page