SAKSHITHA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ లో నెలకొన్న మంజీర ప్రధాన పైప్ లైన్ లీకేజీ సమస్యను వాట‌ర్ బోర్డు, జిహెచ్ఎంసి అధికారులతో మరియు కాలనీ వాసులతో కలసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

సాక్షిత : ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ హైదర్ నగర్ లో నెలకొన్న మంజీర ప్రధాన పైప్ లైన్ లీకేజీ సమస్యను వాట‌ర్ బోర్డు, జిహెచ్ఎంసి అధికారులతో మరియు కాలనీ వాసులతో కలసి పరిశీలించడం జరిగిందని ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన మరమత్తు పనులు పూర్తి చేసి నీటి సరఫరా కి ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని అధికారులను కార్పొరేటర్ ఆదేశించారు. ఇంకా ఎక్కడైనా లీకేజ్ అయ్యే పరిస్థితి ఉన్న పైప్ లైన్ లను గుర్తించి లీకేజీ మళ్ళీ సంభవించకుండా వాటిని కూడా సరిచేయాలని సూచించారు. డివిజన్ లో ఎక్కడ నీటి సమస్య తలెత్తకుండా కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని అధికారులకు కార్పొరెటర్ నార్నె శ్రీనివాస రావు సూచించారు. అదేవిధంగా ప్రతి కాలనీ, బస్తీల‌లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చూస్తానని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని. మీ కాలనీ లలో ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా నన్ను కానీ, కార్పోరేటర్ కార్యాలయాన్ని కానీ సంప్రదించాలని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో అధికారులు డీజీఎం లు భాస్కర్, నాగ ప్రియ, మేనేజర్ ప్రశాంతి, డీఈ రమేష్, ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్, మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,


SAKSHITHA NEWS