ట్రెక్కింగ్ మార్గం ద్వారా మంగళగిరి గండాలయ స్వామి వద్దకు చేరుకున్నారు…ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి

Spread the love

ఈరోజు ఉదయం 7.00 గంటలకు మంగళగిరి కొండ వెనుక టెంపుల్ హిల్ ఎకో పార్క్ వద్ద నుండి ట్రెక్కింగ్ మార్గం ద్వారా మంగళగిరి గండాలయ స్వామి వద్దకు చేరుకున్నారు…ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి

ట్రేక్కింగ్ మార్గంలో లోటుపాట్లను మరియు పలు సూచనలను DFO గారికి, ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు.

అనంతరం గండాలయ్య స్వామి వద్దకు చేరుకుని దాతల సహకారంతో నిర్మాణం జరుగుతున్న అన్న సత్రాన్ని మరియు గండాలయ స్వామి రాతి మండప నిర్మాణ పనులను పరిశీలించారు.

నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు కాంట్రాక్టర్కు దాతలకు సూచనలు చేశారు.

ఈ ట్రెక్కింగ్ మార్గం ప్రజలకు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుందని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పరచి పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page