SAKSHITHA NEWS

సీఐగా మల్లిఖార్జునరావు బాధ్యతల స్వీకరణ

సాక్షిత:- పరవాడ పోలీస్ స్టేషన్ సీఐగా ఆర్.మల్లిఖార్జునరావు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల అనంతరం జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడ సీఐగా పనిచేసిన ఎస్.బాలసూర్యారావు అనకాపల్లి జిల్లా స్పెషల్ బ్రాంచ్కి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విశాఖ వీఆర్ లో ఉన్న మల్లిఖార్జునరావును ఇక్కడ సీఐగా ఉన్నతాధికారులు నియమించారు. బాధ్యతలు స్వీకరించిన సంధర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ పరిధిలోని ప్రజలకు నిత్యం అందు బాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అసాంఘిక కార్యక్రమాలపై గట్టి చర్యలు చేపడతామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. స్టేషన్ పరిధిలోని సిబ్బంది సీఐని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


SAKSHITHA NEWS