మహాత్మ జ్యోతిబాపూలే అంబేద్కర్ జయంతోత్సవాలు

Spread the love

మహాత్మ జ్యోతిబాపూలే అంబేద్కర్ జయంతోత్సవాలు
— 5న పూలే అంబేద్కర్ ఉత్సవాల కమిటీ ఏర్పాటు
— 11, 14న మహనీయుల జయంతోత్సవాలు
— ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ దాసరి రాజశేఖర్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

మహాత్మ జ్యోతిబాపూలే భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కలిసివచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కుల, ప్రజా సంఘాలతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ దాసరి రాజశేఖర్ అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మహాత్మా జ్యోతిబాపూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతోత్సవాల కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు పెల్లూరి విజయ్ కుమార్, దాసరి రాజశేఖర్ లు మాట్లాడుతూ… మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకుగాను జ్యోతిబాపూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యయన కమిటీని గౌడ, విశ్వబ్రాహ్మణ, ముదిరాజ్, గంగపుత్ర, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కుల, ప్రజా సంఘాలతో ఏప్రిల్ 5న పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటుకు అందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. తద్వారా ఏప్రిల్ 11, ఏప్రిల్ 14న ఖమ్మంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ మహాత్మ జ్యోతిరావుపూలే ప్రాంగణంలో మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలకు 9676807984 ను సంప్రదించాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పెరుగు వెంకటరమణ యాదవ్, చేకూరి చైతన్య, కొత్త రాంబాబు, రంజిత్ నాయక్, రెడ్డిబోయిన వరలక్ష్మి, ఆకారపు కృష్ణవేణి, గన్నోజు గోవిందమ్మ, వీరమల్ల ఊర్మిళ, పాడగంగి రాంబాబు, కమరగిరి హనుమంతరావు, గద్దె వెంకటరామయ్య, కోలా ప్రవీణ్, నేలాల వంశి, సంకినేని వంశీ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page