జెపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి

Spread the love

మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి

…….
.
సాక్షిత జూలూరుపాడు :
జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జూలూరుపాడు ఎస్సి బాయ్స్ హాస్టల్లో ,జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మరియు పిల్లలకు చాక్లెట్స్ బిస్కెట్లు పంపిణి చేసేరు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణ‌గారిన‌వ‌ర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయుని స్మృతిలో నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. మ‌హిళ‌లు, అట్ట‌డుగువ‌ర్గాల ఆత్మ‌గౌర‌వ పోరాటానికి విద్య‌నే ఆయుధంగా అందించిన పూలే మ‌హాశ‌యుని ఆశ‌యసాధ‌న‌కి కృషి చేయ‌డం మ‌నంద‌రి బాధ్య‌త‌ తెలియజేశారు ఈ కార్యక్రమంలో జెపిఆర్ ట్రస్ట్ అధ్యక్షులు ఇడుపుల రాజు కానిస్టేబుల్ కృష్ణ, ట్రస్ట్ సభ్యులు ప్రవీణ్ హాస్టల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page