SAKSHITHA NEWS

సాక్షిత : మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ లో ఓం శాంతి బ్రహ్మ కుమారీ వారి నూతన భవన నిర్మాణం కొరకు జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అయ్యప్ప సొసైటీ లో ఓం శాంతి బ్రహ్మ కుమారీ వారు నిర్మించ తలపెట్టిన నూతన భవన నిర్మాణము కు భూమి పూజ కార్యక్రమం నిరవహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని,ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతగానో తోడ్పపడుతుంది అని , యోగ ,ఆధ్యాత్మిక ప్రార్థనలు చేస్తూ శాంతి ప్రవచనాలు చేస్తారని, ఈ భవన నిర్మాణం కోరకు ప్రతి ఒక్కరు సహకరించాలని , భవన నిర్మాణము పనులు త్వరితగతిన పూర్తి చేయలని, త్వరలోనే ప్రాంభించుకోవలని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , అయ్యప్ప సొసైటీ ప్రెసిడెంట్ పెద్ద మధుసూదన్ రెడ్డి తెరాస నాయకులు చిన్న మధుసూదన్ రెడ్డి, వెంకటేశ్వర రావు మరియు బ్రహ్మ కుమారిస్ హైదరాబాద్ ఇంచార్జ్ BK కుల్దీప్ దిది , రేఖ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS