SAKSHITHA NEWS

వాగులో గల్లంతైన రైతు కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *
వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట్ మండల పరిధిలోని టేకులపల్లి గ్రామానికి చెందిన రైతు అంజయ్య నిన్న పొలం పనుల కోసం వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా, భారీ వర్షం కారణంగా ప్రమాదవశాత్తు వాగులో గల్లంతు కావడం బాధకరమని, ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలని రెవెన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు.

▪️ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS