అందర్నీ కలుపుకొని ముందుకు సాగుదాం

Spread the love

అందర్నీ కలుపుకొని ముందుకు సాగుదాం
పాటి ప్రజాప్రతినిధులతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు


*సాక్షిత : *కాంగ్రెస్ పార్టీ లోని ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఎన్నికల్లో విజయం సాధించేందుకు పాటుపడుదాం అని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. పటాన్ చెరు మండలంలోని పాటి గ్రామ మాజీ సర్పంచ్ రాములు యాదవ్, ఎంపీటీసీ గోపాల్ యాదవ్, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ యాదవ్ లను నీలం మధు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మధును ప్రజా ప్రతినిధులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ అధిష్టానం అరుదైన అవకాశాన్ని తనకు ఇచ్చిందని, ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతి ఒక్కరు తమవంతుగా కృషి చేయాలని కోరారు. పార్టీలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్దాం అని ప్రజా ప్రతినిధులకు సూచించారు. నాయకులు intuc ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి,రమేష్, శంకర్, కృష్ణ, బల్వంత్ రెడ్డి, శ్రీనివాస్, భాస్కర్, నగేష్ యాదవ్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page