లాలాగూడ ఇన్‌స్పెక్టర్‌ పద్మను సస్పెండ్‌

Spread the love

లాలాగూడ ఇన్‌స్పెక్టర్‌ పద్మను సస్పెండ్‌ చేస్తూ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాలిచ్చారు. రోడ్డు ప్రమాదం కేసులో నిర్లక్ష్యం వహించారనే కారణంతో సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది. చిలకలగూడ డీఐ రమేశ్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో యాచకురాలు మృతిచెందింది. బస్సు ఢీకొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. విచారణ జరిపించిన కమిషనర్‌.. తప్పుడు కేసు నమోదు చేసినట్లు గుర్తించారు.

మొఘల్‌పురా ఎస్‌ఐపైనా వేటు

మొఘల్‌పురా ఎస్‌ఐ అశోక్‌ను కూడా సస్పెండ్‌ చేశారు. గతంలో అంబర్‌పేట ఎస్‌ఐగా ఉన్నప్పుడు చరవాణి చోరీ కేసులో బాధితులకు న్యాయం చేయకుండా వేధించినట్లు తెలిసింది. ఫిర్యాదు రావడంతో విచారణ జరిపించి సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది……….

Related Posts

You cannot copy content of this page