జూలూరుపాడు లో బిజెపి మండల సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్

Spread the love

జూలూరుపాడు లో బిజెపి మండల సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా ఈ నెల 15వ తేదీన ఖమ్మం నగరంలో పటేల్ పెరేడ్ గ్రౌండ్లో సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి వర్యులు అమిత్ షా విచ్చేయుచున్నారు నరేంద్రమోడీ పాలన విజయాలు, అభివృద్ధి,ప్రజా సంక్షేమo తో పాటు గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేకవిదానాలు ను భారీ భహిరంగ సభ ద్వారా ప్రజలకు తెలియజేసేందుకు కేంద్ర మంత్రివర్యులు వస్తున్న సందర్బంగా బిజెపి కార్యకర్తలు, ప్రజలు ,అభిమానులు, మేధావులు, యువకులు, మహిళామనులు,బూత్ స్థాయినుండి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ బిజెపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు . ఈ సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్ మాట్లాడుతూ ఈ సభకు లక్ష మంది పైగా ప్రజలు కార్యకర్తలు పాల్గొంటారని అన్నారు. వైరా నియోజకవర్గ కన్వీనర్ నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ వైరా నియోజకవర్గం నుంచి 12 వేలకు మంది పైగా ప్రజలు కార్యకర్తలు పాల్గొంటారని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా కోశాధికారి నున్న రమేష్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీషు,, బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి భూక్య రాజేష్, బీజేపీ మండల కార్యదర్శి భూక్య రమేష్, సిరుపురపు గోపాలరావు ,పుల్లారావు, వందనపు సుబ్బు, కృష్ణ ,కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page