SAKSHITHA NEWS

కెసిఆర్ పాలన ఒక స్వర్ణ యుగం

బీసీ బందు చెక్కుల పంపిణి….

జెడ్పీ చైర్ పర్సన్ బడే నాగ జ్యోతి

కుల వృత్తులు చేసుకునే వారికి వెన్నెముక ముఖ్యమంత్రి కెసిఆర్ అని ములుగు జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. వెంకటపూర్ మండల కేంద్రం లోని ఎంపిడిఓ కార్యాలయంలో స్థానిక ఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంప్రదాయ కులవృత్తుల అభివృద్ధి పథకంలో బాగంగా పంపిణీ చేసే 46 మంది లబ్ధిదారులకు 46 లక్షల రూపాయల చెక్కులను ఆమె చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ కులవృత్తుల చేసుకునే వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని BRS ప్రభుత్వం లక్ష రూపాయల సహాయం చేస్తున్నదని, ఇది ఒక నిరంతర ప్రక్రియ అని ఆమె అన్నారు.బీ ఆర్ ఎస్ హయాంలో చేనేత కార్మికులకు, కల్లు గీత కార్మికులకు పింఛన్లు ఇచ్చామని, గొల్ల కుర్మలకు ఉచితంగా గొర్రెల పంపిణీ చేశామని అన్నారు. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు, రొయ్యల పిల్లల పంపిణీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన స్వర్ణ యుగం అన్నారు. సమైక్య పాలనలో విధ్వంసం నేడు వికాసం అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఏదోరకంగా ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్న మనమంతా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కెసిఆర్ ని గుర్తు పెట్టుకోవాలని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమం లో ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య, జడ్పీటీసీ రుద్రమదేవి అశోక్, మండల అధ్యక్షులు రమణారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ హోదాలో వున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వెంకటాపూర్ మండల నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS