SAKSHITHA NEWS

కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదల ప్రభుత్వం: ఎమ్మెల్యే గూడెం

ఆసరా పింఛన్ లతో నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

జిన్నారం గ్రామ పంచాయితీ పరిధిలోని 66 మంది లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు.

సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీ లావణ్య, సర్పంచులు రేఖ,లావణ్య, ప్రశాంతి లు ఎమ్మెల్యే లు పూలతో మహిళలతో కలసి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు..

జిన్నారం సర్పంచ్ అంతిరెడ్డిగారి లావణ్య శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే సమక్షంలో పలువురికి పింఛన్ పత్రాలను అందజేశారు

ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్,ఎంపీటీసీ వెంకటేశం గౌడ్,ఎంపీటీసీ లావణ్య నరేష్,వార్డు సభ్యులు శ్రీధర్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్,ఏర్పుల లింగం,ఎరుకల చిరంజీవి,కో ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్,నాయకులు బ్రహ్మేందర్ గౌడ్,తోట నర్సింగ్ రావు,కొరబోయిన యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS