జయలక్ష్మి సీడ్స్ లో జేసీ ఆకస్మిక తనిఖీ!

Spread the love

పల్నాడు జిల్లా
వినుకొండ:

📌జయలక్ష్మి సీడ్స్ లో జేసీ ఆకస్మిక తనిఖీ!

స్తూపం సెంటర్ లో జయలక్ష్మి విత్తనాల షాపులో జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ అకస్మిక తనిఖీ నిర్వహించారు.

జెసి తనిఖీ లతో బెంబేలెత్తి పలు దుకాణాలు మూసివేసిన సీడ్స్ వ్యాపారులు,

విత్తనాలు అధిక ధరలకు విక్రయించకుండా రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని సూచించారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విత్తనాల షాపులో తనిఖీలు నిర్వహిస్తుండగా పలు విత్తనాల షాపుల యజమానులు షాపులు మూసివేసి వెళ్లి పోవటం గమనార్హం.

అది గమనించిన జెసి షాపులు ఎందుకు మూసి వేసి వెళ్లిపోయారో విచారించవలసినదిగా ఏడిఎ రవిబాబు ను ఆదేశించారు.

తనిఖీల్లో వినుకొండ తహశీల్దార్ కిరణ్ కుమార్, వ్యవసాయ శాఖ సిబ్బంది పొల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page